తిరుమలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలను వెల్లడించిన టీటీడీ

by Prasanna |
తిరుమలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలను వెల్లడించిన టీటీడీ
X

దిశ,వెబ్ డెస్క్: తిరుమలలో నవంబరు నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ వెల్లడించింది. ఆ వివరాలు ఏంటో ఇక్కడ చూద్దాం.. నవంబరు 9న మతత్రయ ఏకాదశి, 11న మాస శివరాత్రి, 12న దీపావళి ఆస్థానం, 14న శ్రీ తిరుమలనంబి శాత్తుమొర, 15న భగనీహస్త భోజనం, 16న శ్రీ మనవాళ మహాముని శాత్తుమొర, 17న నాగుల చవితి, పెద్ద శేష వాహనం, 18న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణం, 19న శ్రీ వారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, స్కంద షష్టి, 22న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి, 23న ప్రబోధన ఏకాదశి, 24న కైశిక ద్వాదశి ఆస్థానం, శ్రీ చక్రతీర్థ ముక్కోటి, 26న కార్తీక పౌర్ణమి, 27న శ్రీ తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర, 28న శ్రీ తిరుప్పాణాళ్వార్ వర్ష తిరునక్షత్రం జరగనున్నాయి.


Next Story