- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Viral Video:నాగు పామును పట్టుకొని అడవిలోకి వదిలిన టీటీడీ ఉద్యోగి.. ఇంతకీ అది ఎక్కడకి వచ్చిందంటే?

దిశ,వెబ్డెస్క్: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఎప్పుడు భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల(Tirumala)లో ఐదు అడుగుల నాగుపాము(Cobra) హల్చల్ చేసింది. తిరుమల తిరుపతి కొండపై వీఐపీ ప్రాంతం పద్మావతి ఏరియాలో నాగు పాము బుసలు కొడుతూ కలకలం రేపింది. తిరుమల నారాయణ గిరి స్పెషల్ కాటేజ్లో రూమ్ 12 దగ్గర నాగు పాము భక్తులకు(Devotees) కనిపించింది. దీంతో ఐదు అడుగుల నాగుపామును చూడగానే.. భక్తులంతా ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో ఆందోళనకు గురయ్యారు.
ఈ విషయం TTD సిబ్బందికి తెలియజేయడంతో వెంటనే అతను అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో టీటీడీకి చెందిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగి భాస్కర్ నాయుడు అక్కడకి చేరుకొని.. అత్యంత చాకచక్యంగా నాగుపామును బంధించారు. ఆ పాము 5.5 అడుగులు ఉందని అతను తెలిపారు. విష సర్పాన్ని పట్టడానికి శ్రమించారు. అరగంట పాటు భక్తులు భయాందోళనకు(Panic) గురయ్యారు. అనంతరం ఆ నాగుపామును చేతితో పట్టుకొని పాపనాశనం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. నాగుపామును అక్కడి నుంచి తరలించడంతో స్థానికులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. చేతితో నాగుపామును పట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.