Trending: మన అనుకున్న వాళ్ల కోసం ఎంత వరకైనా వెళ్తా.. అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)

by Shiva |
Trending: మన అనుకున్న వాళ్ల కోసం ఎంత వరకైనా వెళ్తా.. అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు రసవత్తరంగా కొనసాగాయి. పోలిటికల్ పార్టీల మధ్య కన్నా.. అల్లు అర్జున్ వర్సెస్ మెగా బ్రదర్స్ అన్న చందంగా వార్ నడిచింది. ఆ ఎన్నికల్లో జనసేన అధినేత, బన్నీకి స్వయానా మామ అయిన పవన్‌కు అతడు మద్దుతు ఇవ్వలేదు. ప్రత్యర్థి పార్టీ అయిన నంద్యాల వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్‌రెడ్డి తరఫున అల్లు అర్జున్ అక్కడి వెళ్లి ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు, బన్నీపై ట్విట్టర్ వేదిగా సంచలన ట్వీట్లతో విరుచుకు‌పడ్డారు. వారిద్దరి మధ్య ఓ రేంజ్‌లో డైలాగ్ వార్ నడించింది. ఓ దశలో నాగబాబు తన ట్వీట్లను సైతం డెలీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం సాధించినప్పుడు కూడా బన్నీ రెస్పాండ్ కాలేదు.

డిప్యూటీ సీఎం‌గా పవన్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఎక్కడా కనిపించను లేదు. అనంతరం అల్లు అర్జున్‌ జనసేన నేతల నుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ట్రోల్స్‌ ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మారుతీ నగర్‌ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వివాదానికి కేరాఫ్‌గా నిలిచాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మై డియర్‌ ఫ్యాన్స్‌.. మీరే నా ఆర్మీ, నా ఫ్యాన్స్‌ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్‌ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్‌ని చూసి హీరోనయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లయినా మీరు చూపే ప్రేమ అస్సలు తగ్గలే. నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడగలగాలి. మన అనుకున్న వాళ్ల కోసం ఎంత వరకైనా వెళ్తా..! అంటూ కామెంట్ చేశారు. ఎన్నికలు ముగిసిన తరువాత మొదటిసారి బన్ని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారాయి.

Advertisement

Next Story