అసెంబ్లీకి రాకుండానే వైసీపీ ప్రశ్న: స్పీకర్ సంచలన నిర్ణయం

by srinivas |
అసెంబ్లీకి రాకుండానే వైసీపీ ప్రశ్న: స్పీకర్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు(Ap Assembly Sessions) కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు(YCP MLAs) పేపర్ ద్వారా ప్రశ్నోత్తరాల్లో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం జరిగింది. వైసీపీ సభ్యుల ప్రశ్నలకు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు(Speaker Chintakayala Ayyanna Patrudu) ఖాళీ కుర్చీలను చూపించారు. వైసీపీ సభ్యులు ప్రశ్న అడిగారు కానీ, సభకు రాలేదన్నారు. అందుకే వాళ్లు అడిగిన ప్రశ్నను వాయిదా వేస్తున్నానని స్పీకర్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed