- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > ఆంధ్రప్రదేశ్ > Pensioners: పెన్షన్దారులకు మరో శుభవార్త.. పంపిణీకి గైడ్లైన్స్ విడుదల చేసిన ప్రభుత్వం
Pensioners: పెన్షన్దారులకు మరో శుభవార్త.. పంపిణీకి గైడ్లైన్స్ విడుదల చేసిన ప్రభుత్వం
by Shiva |

X
దిశ, వెబ్డెస్క్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం పెంచిన పెన్షన్ల పంపిణీని అట్టహాసంగా ప్రారంభించింది. జూన్ నెలలో వాలంటీర్ల సాయం లేకుండానే పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ క్రమంలోనే చెప్పిన విధంగా ప్రభుత్వం ఆగస్టు 1న పెన్షన్ల పంపిణీకి మరోసారి రెడీ అయింది. పింఛన్ల లబ్ధిదారులకు ఒక్క రోజులోనే పంపిణీ పూర్తి చేయాలంటూ గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ గైడ్లైన్స్ విడుదల చేసింది. అందులో భాగంగా ఆగస్టు 1న ఉదయం 6 గంటలకే పింఛన్ మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొదటి రోజు పెన్షన్ల పంపిణీలో భాగంగా 99 శాతం పంపిణీని చేయాలని ఆ గైడ్లైన్స్లో ఉంది. ఒకవేళ పంపిణీలో ఏదైనా సాంకేతిక సమస్య రెండో రోజు పెన్షన్ లబ్ధిదారులకు ఇవ్వాలని స్పష్టం చేసింది.
Next Story