జగన్‌పై భౌతిక దాడికి కుట్ర.. టీటీడీ మాజీ చైర్మన్ భూమన సంచలన ఆరోపణలు

by srinivas |
జగన్‌పై భౌతిక దాడికి కుట్ర.. టీటీడీ మాజీ చైర్మన్ భూమన సంచలన  ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు చెప్పినట్టే తిరుమల తిరుపతి దేవస్థానం నడుచుకుంటోందని మాజీ ఈవో భూమన కరుణ్ రెడ్డి అన్నారు. వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన రద్దు నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేణిగుంట ఎయిర్‌పోర్టులో జగన్‌పై దాడి జరుగుతుందనే సమాచారం తమకు ఉందని చెప్పారు. ఆరుగురితో కలిసి శ్రీవారిని దర్శించుకోవాలని జగన్ అనుకున్నారని, పార్టీ ముసుగులో బీజేపీ వాళ్లు దాడి చేస్తారనే సమాచారం ఉందని తెలిపారు. జగన్‌పై దాడి జరిగితే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తమ హయాంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed