AP Govt:అకౌంట్‌లో డబ్బులు జమ కానీ వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

by Jakkula Mamatha |
AP Govt:అకౌంట్‌లో డబ్బులు జమ కానీ వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా విజయవాడలో వరదలు(Vijayawada Floods) అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరద బాధితులకు(Flood Victims) సహాయార్థం సీఎం సహాయనిధికి పలువురు దాతలు విరాళాలు అందిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం(AP Government) వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందిస్తోంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలతో(Floods) నష్టపోయిన వారికి ప్రభుత్వం పరిహారం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురి బ్యాంక్ ఖాతాల్లో(Bank Account) ఇప్పటికే నగదు జమ చేసింది. అయితే పలు కారణాలతో నగదు జమ కాని బాధితులకు రేపు నేరుగా సాయం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సాయం అందిస్తారు. అటు వరద సాయంలో పాల్గొన్న వారితో సీఎం చంద్రబాబు భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed