- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రేపు ఆ జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
by Jakkula Mamatha |
X
దిశ, పత్తికొండ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాలమాడ గ్రామంలో పర్యటన ఖరారు అయింది. రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు కర్నూలు విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి పుచ్చకలమాడ గ్రామానికి 1.05 గంటలకు చేరుకుంటారు. అక్కడే ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం 1.45 నిమిషాలకు హెలిపాడ్ నుండి బయలుదేరి 2.25 నిమిషాలకు పుచ్చకాలమాడ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేస్తారు. అనంతరం గ్రామస్తులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహిస్తారు. 3.35 గంటలకు హెలిపాడ్ చేరుకొని 4.00 గంటలకు కర్నూలు విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరుతారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే శ్యామ్ బాబు, కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ బిందు మాధవ్ పర్యవేక్షిస్తున్నారు.
Advertisement
Next Story