టీటీడీలో ఏ పాలకుడు చేయని అక్రమాలు జగన్ చేశాడు : మాధవీలత

by Y. Venkata Narasimha Reddy |
టీటీడీలో ఏ పాలకుడు చేయని అక్రమాలు జగన్ చేశాడు : మాధవీలత
X

దిశ, వెబ్ డెస్క్ : టీటీడీలో ఏ పాలకుడు చేయని అక్రమాలు మాజీ సీఎం వైఎస్ జగన్ చేశాడని బీజేపీ నాయకురాలు మాధవీలత విమర్శించారు. శుక్రవారం ఆమె తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. అనంతరం మాధ‌వీల‌త‌ మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్ స్వామివారి దర్శనానికి వచ్చేట‌ప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం ద్వారా స్వామి వారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. గత ఐదేళ్లలో తిరుమల పవిత్రతను కాపాడలేదన్నారు. కాగా వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం కల్తీతో జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా ఆమె తిరుమల సందర్శించారు. వందేభారత్ రైలులో సహచర భక్త బృందంతో కలిసి ఆ గోవిందుడి నామం జపిస్తూ.. శ్రీనివాసుడి పాటలు పాడుతూ భజన చేస్తూ తిరుమలకు చేరుకున్నారు. వెంకటేశ్వరస్వామికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా నడక మార్గంలో తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed