- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
‘నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందా లేదా అనేది అనవసరం’.. బీజేపీ నేత హాట్ కామెంట్స్
దిశ,వెబ్డెస్క్: ఏపీలోని తిరుమల లడ్డూ కల్తీ వివాదం పై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటన పై దర్యాప్తుకు ఏపీ ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూ వివాదం, సిట్ దర్యాప్తు పై మాజీ ఎంపీ, బీజేపీ నేత టీజీ వెంకటేష్ హాట్ కామెంట్స్ చేశారు. తిరుపతిలో నేడు(ఆదివారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెయ్యి కల్తీ జరిగిందంటే చాలు కేసు పెట్టొచ్చు. అందులో జంతువుల కొవ్వు ఉందా? లేదా? అనేది అనవసరం అన్నారు. నెయ్యి స్వచ్ఛంగా లేకుండా ఏది కలిపినా కల్తీ అయినట్లే అని ఆయన అన్నారు. ఈ క్రమంలో కత్తి లేదా తుపాకితో చంపిన హత్యే అవుతుందని ఎద్దెవా చేశారు. శిక్ష ఒక్కటే. సిట్ పై వైసీపీ నేతలకు నమ్మకం లేకపోతే సీబీఐ పైన కూడా వారికి నమ్మకం ఉండదు అని పేర్కొన్నారు. కల్తీ అయ్యింది కేసు పెట్టారు.. ఇక వేరే అంశాలపై ప్రభుత్వం దృష్టి పెడితే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు.