Breaking: ఏపీ హైకోర్టులో మరికాసేపట్లో చంద్రబాబు కేసుల విచారణ

by srinivas |
Breaking: ఏపీ హైకోర్టులో మరికాసేపట్లో చంద్రబాబు కేసుల విచారణ
X

దిశ, వెబ్ డెస్క్: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణ ఏపీ హైకోర్టులో మరికాసేపట్లో జరగనుంది. అటు సీఐడీ పీటీ వారంట్‌ పై హైకోర్టు ఇచ్చిన స్టే గడువు నేటితో ముగియనుంది. ఇక ఇదే కేసులో నిందితులు మాజీ మంత్రి నారాయణ భార్య రమాదేవి, బావమరిది, ఉద్యోగి ప్రమీల దాఖలు చేసిన పిటిషన్‌పైనా హైకోర్టు విచారించనుంది. మరోవైపు అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ పెట్టిన కేసులపైనా తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అమరావతిలో అసైన్డ్ భూములకు సంబంధించి చంద్రబాబు, నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. నారాయణ క్వాష్, బెయిల్ పిటిషన్‌పై ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed