- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘ఎన్టీఆర్ను తగ్గించాలని చూస్తే.. ఆకాశంపై ఉమ్మేసినట్లే’

దిశ, వెబ్డెస్క్: నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ప్లెక్సీలు తొలగించాలని ఆదేశాలు జారీ చేయడం రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ ఇన్సిడెంట్తో నందమూరి కుటుంబ గొడవలు ఒక్కసారిగా రోడ్డుమీదకు వచ్చాయి. తాజాగా.. ఈ వివాదంపై మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రాసాద్ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ ఆకాశంలో ఉన్నారని.. తారక్ను తగ్గించాలని చూస్తే ఆకాశంపై ఉమ్మేసినట్లే అని వ్యాఖ్యానించారు.
అది బాలకృష్ణ అయినా.. ఇంకెవరైనా సరే అని అన్నారు. తారక్ ఎదుగుదలకు ఆయన తల్లే కారణమని.. బాలకృష్ణ సహా ఇంకెవరి ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఏం జరుగబోతుందో అందరికీ తెలుసని.. విజయం, అపజయాలకు జగన్దే బాధ్యత అని చెప్పారు. మరోవైపు శనివారం నిర్వహించబోయే ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్ఆర్ శత జయంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నట్లు యార్లగడ్డ చెప్పారు.