- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దీని గురించి ప్రతీ ఒక్కరూ ముందడుగు వేయాలి.. పవన్ కళ్యాణ్ కీలక పిలుపు

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ చిత్తడి భూముల దినోత్సవం సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఆసక్తికర ట్వీట్ చేశారు. చిత్తడి నేలల సంరక్షణ గురించి చెబుతూ.. ప్రజలకు సంచలన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన.. ప్రకృతిలో అత్యంత విలువైన పర్యావరణ వ్యవస్థలలో చిత్తడి భూములు ప్రధానమైనవని, ఈ రోజు ప్రపంచ చిత్తడి భూముల దినోత్సవం (World Wetlands Day) సందర్భంగా పర్యావరణంలో చిత్తడి భూముల ప్రాధాన్యాన్ని అందరం గుర్తించాలని అన్నారు. ఇవి సహజ నీటి శుద్ధి కేంద్రాలు.. కార్బన్ నిల్వ కేంద్రాలు, వర్షపు నీటిని భూగర్భానికి చేరుస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడే అసాధారణమైన ప్రదేశాలు అని వివరించారు.
ఈ భూములు భూకంప ఉద్ధృతిని తగ్గించడంలో, వాతావరణ మార్పులను నియంత్రించడంలో, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో 25,000 పైగా చిత్తడి నేలలు ఉన్నాయని, వీటిలో ప్రముఖమైనది కొల్లేరు సరస్సు (Kolleru Lake) అని, ఇది రామ్సర్ సైట్ (Ramsar site)గా గుర్తింపు పొందిన భారతదేశంలోని అతి పెద్ద మంచి నీటి సరస్సులలో ఒకటి అని అన్నారు. అలాగే, దేశంలో రెండవ అతి పెద్ద ఉప్పు నీటి సరస్సైన పులికాట్ సరస్సు (Pulicat Lake) అని, సముద్ర జీవజాలానికి కీలకమైన ఉప్పుటేరు వాతావరణ వ్యవస్థ కూడా ఉన్నాయని తెలిపారు. ఈ భూములు పక్షుల సంరక్షణకు, మత్స్య సంపదకు మాత్రమే కాదు.. వ్యవసాయానికి ఉపయోగపడుతూ వేలాది మంది ప్రజలకు జీవనాధారం అందిస్తున్నాయని వెల్లడించారు.
ఇక ఈ విలువైన వనరులను రక్షించడానికి మన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని, ఆక్రమణలను నివారించేందుకు, భౌగోళిక పరిమితులను జచ్చితంగా నిర్ధారించేందుకు కృషి జరుగుతోందని తెలిపారు. అయితే, పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు.. మన అందరి బాధ్యత అని, మనం దానిని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. అలాగే స్వప్రయోజనాలను తగ్గించుకోవడం ద్వారా మాత్రమే ప్రకృతిని కాపాడగలమని, ప్రతి చిన్న ప్రయత్నం సమష్టిగా మొదలైతే పెద్ద మార్పుకు దారి తీస్తుందని చెప్పారు. అవగాహన, ప్రామాణికమైన పద్ధతులు, ప్రకృతిపట్ల గౌరవం కలిగినప్పుడు మాత్రమే ఈ విలువైన పర్యావరణ వ్యవస్థలను రాబోయే తరాలకు అందించగలమని, మన భవిష్యత్తు కోసం మనం ఈ రోజు నుంచే కార్యాచరణ ప్రారంభిద్దాం! అని జనసేన అధినేత అన్నారు.