ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్ వీడియో

by Mahesh |
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్ వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కూటమి పార్టీ ఇచ్చిన హామీని నెరవేరుస్తూ.. ఈ రోజు(20-04-2025) ఉదయం పది గంటలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 16,347 టీచర్ పోస్టులను ఇందులో భర్తి చేయనున్నారు. నేటి నుంచి మే 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. అలాగే జూన్ 5 నుంచి జులై 6 వరకు ఈ పరీక్షలను పటిష్టంగా నిర్వహించనున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ పై మొదటి నుంచి పూర్తి సమాచారం తెలుసుకుంటున్న మంత్రి లోకేష్.. ఎక్కడ కూడా చిన్న తప్పులు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో సాధరన అభ్యర్థులు తమ ఫోన్లో కూడా ఈ మెగా డీఎస్సీ కి అప్లై చేసుకునేలా వీలు కల్పించారు. ఇందుకోసం ఎలా అప్లై చేసుకోవాలనే క్లియర్ సమాచారంతో కూడిన వీడియోను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఆ వీడియోలో అప్లీకేషన్ ప్రాసెస్ ఎంటీ, ఎన్ని స్టెప్పులు ఉన్నాయి. ఏ అభ్యర్థులు ఎలా అప్లై చేయాలని, నగదు పేమెంట్ ఎలా చేయాలనే పూర్తి సమాచారాన్ని సులభతరం చేస్తూ వివరించారు. ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ వీడియో చూడండి.



Next Story