- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఏపీ సచివాలయంలో నూతన మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు
దిశ, వెబ్డెస్క్: ఏపీలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. నాలుగో సారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. 24 మందితో మంత్రి మండలిని ఏర్పాటు చేశారు. నూతన మంత్రులకు ఇటీవల శాఖలు సైతం కేటాయించారు. కొత్త మినిస్టర్లకు తాజాగా రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వం ఛాంబర్లు కేటాయించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు రెండో బ్లాక్లోని ఛాంబర్ నెంబర్ 211 కేటాయించారు. పవన్తో పాటు రెండో బ్లాక్లో మంత్రులు నాదెండ్ల, కందుల దుర్గేష్, నారాయణ, అనిత, పయ్యావుల, ఆనం నారాయణ రెడ్డి ఛాంబర్లు అలాట్ చేశారు. బ్లాక్-3లో గొట్టిపాటి, కొల్లు, సంధ్యారాణి, డోలా, ఫరూక్లకు ఛాంబర్లు ఇచ్చారు. నారా లోకేష్, అనగాని, అచ్చెన్న, సవిత, టీజీ భరత్, రాంప్రసాద్ రెడ్డి, కొలుసు, నిమ్మల ఐదో బ్లాక్లో ఛాంబర్లు కేటాయించారు. బ్లాక్-5లో బీసీ జనార్ధన్ రెడ్డి, కొండపల్లి, వాసంశెట్టి, సత్యకుమార్లకు ఛాంబర్లు అలాట్ చేశారు.
Read More..
BREAKING: సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. AP అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్..