- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్షల తేదీలు విడుదల.. ఫీజు చెల్లింపునకు లాస్ట్ డేట్ ఇదే?

దిశ,వెబ్డెస్క్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ రోజు(బుధవారం) ఉదయం పది గంటలకు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను Andhra Pradesh విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) విడుదల చేశారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఈ ఏడాది 6,14,459 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 81.14 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అందులో అబ్బాయిలు 78.31శాతం ఉండగా, అమ్మాయిలు 84.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. పార్వతీపురం మన్యం జిల్లా 93.90 శాతం ఉత్తీర్ణత రేటుతో అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో 1,680 పాఠశాలలు 100 శాతం ఫలితాలను సాధించారని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
అయితే.. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు నిరుత్సాహ పడకుండా రెండవ అవకాశాన్ని ప్రభుత్వం(AP Government) కల్పించింది. ఈ నేపథ్యంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు వచ్చే నెల(మే) 19వ తేదీ నుంచి 28 వరకు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. వీటికి సంబంధించిన పరీక్ష తేదీల పూర్తి షెడ్యూల్ను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఇక ఈ సప్లిమెంటరీ పరీక్షల(Supplementary tests) ఫీజు రేపటి(ఏప్రిల్ 24) నుంచి మే 1వ తేదీ వరకు చెల్లించవచ్చని తెలిపారు. అయితే రూ.50 ఆలస్య రుసుముతో మే 1 నుంచి మే 18 వరకు అవకాశం కల్పించారు. ఇక రీకౌంటింగ్ కోసం ప్రతి సబ్జెక్ట్ కు రూ.500, రీవెరిఫికేషన్ కోసం ప్రతి సబ్జెక్ట్ రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని ఏపీ విద్యాశాఖ(Education department) అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ bseaps.in ని సందర్శించండి.