కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి

by Anil Sikha |
కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2024-25 సంవత్సరంలో విడుదలైన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.3,324 కోట్లు తగ్గిన మాట వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు. ఆర్థిక సంఘం, కేంద్ర పథకాల నిధుల్లోనూ గతేడాది కన్నా ఈ ఏడాది నిధుల రాక తగ్గిందని ఆరోపించారు. వాస్తవాలను కప్పిపెట్టి ఏపీకి రూ.3లక్షల కోట్లు అందించామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పడం దుర్మార్గమని విమర్శించారు

Next Story