మరో రెండ్రోజులు.. వానలే వానలు

by  |
మరో రెండ్రోజులు.. వానలే వానలు
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని.. దానికి అనుబంధంగా 5.8 కి.మీ ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది.

ఉత్తర, దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అలాగే తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.


Next Story

Most Viewed