CM Jagan: YCP జీవిత కాల అధ్యక్షుడిగా జగన్.. ప్లీనరీలో అధికారిక ప్రకటన
Vijaya Sai Reddy Announced CM Jagan As a Lifetime President of YSRCP| ప్లీనరీ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. పార్టీ శాశ్వత(జీవిత కాల) అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ప్రకటించారు. ఈ విషయాన్ని వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ పక్షనేత విజయసాయిరెడ్డి ప్రకటించారు
దిశ, వెబ్డెస్క్: Vijaya Sai Reddy Announced CM Jagan As a Lifetime President of YSRCP| ప్లీనరీ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. పార్టీ శాశ్వత(జీవిత కాల) అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ప్రకటించారు. ఈ విషయాన్ని వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ పక్షనేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. ప్లీనరీలో తీర్మాణం ప్రవేశ పెట్టి, సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాజ్యాంగాన్ని సవరించింది. కాగా, పండగలా రెండో రోజు వైఎస్సార్సీపీ ప్లీనరీ జరుగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. కార్యకర్తల నినాదాలతో ప్లీనరీ ప్రాంగణం మార్మోగుతోంది. వర్షంలో తడుస్తూ కూడా నేతల ప్రసంగాలను కార్యకర్తలు వింటుండటం గమనార్హం.