CM Jagan: YCP జీవిత కాల అధ్యక్షుడిగా జగన్.. ప్లీనరీలో అధికారిక ప్రకటన

Vijaya Sai Reddy Announced CM Jagan As a Lifetime President of YSRCP| ప్లీనరీ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. పార్టీ శాశ్వత(జీవిత కాల) అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ప్రకటించారు. ఈ విషయాన్ని వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ పక్షనేత విజయసాయిరెడ్డి ప్రకటించారు

Update: 2022-07-09 08:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: Vijaya Sai Reddy Announced CM Jagan As a Lifetime President of YSRCP| ప్లీనరీ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. పార్టీ శాశ్వత(జీవిత కాల) అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ప్రకటించారు. ఈ విషయాన్ని వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ పక్షనేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. ప్లీనరీలో తీర్మాణం ప్రవేశ పెట్టి, సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాజ్యాంగాన్ని సవరించింది. కాగా, పండగలా రెండో రోజు వైఎస్సార్‌సీపీ ప్లీనరీ జరుగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. కార్యకర్తల నినాదాలతో ప్లీనరీ ప్రాంగణం మార్మోగుతోంది. వర్షంలో తడుస్తూ కూడా నేతల ప్రసంగాలను కార్యకర్తలు వింటుండటం గమనార్హం.

Tags:    

Similar News