Revanth Reddy| Prashant Kishor: పీకే అనూహ్య నిర్ణయం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే!

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రశాంత్ కిశోర్ నిరాకరించిన నేపథ్యంలో టీపీసీసీ ప్రెసిడెంట్ మీడియాతో స్పందించారు.

Update: 2022-04-26 11:46 GMT

Revanth Reddy| Prashant Kishor

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రశాంత్ కిశోర్ నిరాకరించిన నేపథ్యంలో టీపీసీసీ ప్రెసిడెంట్ మీడియాతో స్పందించారు. పీకే నిర్ణయం ఏంటో అధికారికంగా తమకు ఇంకా సమాచారం అందలేదని.. ఆయన కాంగ్రెస్‌లో చేరతారో లేదో అనేది ఆయన వ్యక్తిగత విషయమని అన్నారు. కేసీఆర్‌తో ఎవరు జట్టు కట్టినా తాము వ్యతిరేకిస్తామని చెప్పారు. అది ప్రశాంత్ కిశోర్ అయిన సరే మరో వ్యక్తి అయినా సరే కావొచ్చునని అన్నారు. మోడీ, కేసీఆర్ కలిసి తెలంగాణలో చేసిన అరాచకాలు చాలని అలాంటి కేసీఆర్‌కు మద్దతు తెలపడం వల్లే ప్రశాంత్ కిశోర్‌కు వ్యతిరేకించామే తప్పా ఆయనకు మాకు ఎలాంటి గొడవ లేదన్నారు. పీకే కాంగ్రెస్‌లోకి వస్తే మంచిదని, రాకుంటే మరీ మంచిదని అన్నారు. పీకే నిర్ణయంతో తమ పార్టీ శ్రేణులు మరింత స్పష్టతతో ముందుకు వెళ్తాయని అన్నారు.

Tags:    

Similar News