Shraddha Kapoor: ‘స్త్రీ-2’ సీక్వెల్ అప్డేట్ ఇచ్చిన శ్రద్ధా.. హైప్ పెంచేస్తున్న కామెంట్స్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor), రాజ్ కుమార్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘స్త్రీ-2’.

Update: 2024-10-19 08:26 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor), రాజ్ కుమార్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘స్త్రీ-2’(Stree-2). అయితే ఇది ‘స్త్రీ’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్, పెన్ మరుధర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దినేష్ విజన్(Dinesh Vision), జ్యోతి దేశ్‌పాండే నిర్మించిన ఈ సినిమాకు అమర్ కౌశిక్(Amar Kaushik) దర్శకత్వం వహించాడు. అయితే ‘స్త్రీ-2’(Stree-2) ఆగస్టు 15న విడుదలై సూపర్ హిట్ అయింది. అంతేకాకుండా కలెక్షన్స్ భారీగానే వసూలు చేసింది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధా ‘స్త్రీ-2’(Stree-2) సక్సెస్‌పై రియాక్ట్ అయి సీక్వెల్‌ అప్డేట్ ఇచ్చింది. ‘‘స్త్రీ చూసినప్పుడు ఇలాంటి మూవీ ఇప్పటి వరకు చూడలేదే అనిపించింది. ఆ తర్వాత దానికి సీక్వెల్ కోసం నన్ను సంప్రదించగా నేను ఆశ్చర్యపోయాను. ఇది చాలా మంది వినోదాత్మక చిత్రం. అయితే మొదటి భాగానికి మించిన ఆదరణ ‘స్త్రీ-2’ సినిమాకు లభించిందని భావిస్తున్నా.

దీంతో ఇంత గొప్పగా తెరకెక్కించినందుకు దర్శక నిర్మాతలకు హ్యాట్సాఫ్ చెప్పాలి. అలాగే ఈ విజయం టీమ్ అందరికీ సొంతం. మంచి స్క్రిప్ట్‌తో వస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి రుజువైంది. మూడో పార్ట్‌లో దీనికి మించిన ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. దీనికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. అందులో చాలా డెవలప్‌మెంట్‌లు చేసి తెరకెక్కిస్తున్నారు. ‘స్త్రీ-3’ (Stree -3)త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాన్ని కూడా ఆదరిస్తారని అనుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రద్ధా కమెంట్స్ స్త్రీ-3(Stree -3)పై హైప్ పెంచుతున్నాయి.


👉 Also Read:  బిడ్డను కన్న నెల రోజులకే మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్న స్టార్ హీరోయిన్.. ఆ బ్యూటీనే పాటిస్తోందిగా 

Tags:    

Similar News