Pailam Pilaga: ఓటీటీలో అదరగొడుతున్న ‘పైలం పిలగా’

ఓటీటీలో అదరగొడుతున్న ‘పైలం పిలగా’

Update: 2024-10-27 03:19 GMT

దిశ, వెబ్ డెస్క్ : సాయి తేజ (Sai Teja) హీరోగా తెరకెక్కిన మూవీ ‘పైలం పిలగా’ ( Pailam Pilaga). ఆనంద్ గుర్రం డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో పావ‌ని క‌ర‌ణం (Pavani Karanam) హీరోయిన్‌. హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ పతాకం పై రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ కలిసి ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 20న ఆడియెన్స్ ముందుకొచ్చింది. పాజిటివ్ టాక్ తో రన్ అయింది.

ఇక కథ గురించి మాట్లాడుకుంటే .. ఒక ఊళ్లో బిజినెస్ మొదలు పెట్టి అంబానీ లా ఎదగాలనుకునే ఒక పల్లెటూరి యువకుడి కథ. అయితే, తన ప్రయాణంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, ముఖ్యంగా ప్రభుత్వ అనుమతుల విషయంలో ఉండే రూల్స్,  డబ్బును ఒకానొక సమయంలో ప్రేమించి తన కుటుంబానికి కూడా దూరమై, సొంతూరు ఊరు బాగు కోసం ఏమి చేసాడనేది ఈ సినిమా.

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఈటీవి విన్‌లో ఇక, అక్టోబ‌ర్ 10 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో రోజు రోజుకి ఈ సీరీస్ కు క్రేజ్ పెరిగిపోతోంది. ఓటీటీలో వచ్చే క్రైమ్, హారర్, అడల్ట్ కంటెంట్ కి భిన్నంగా ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూసే కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ఈటీవి విన్‌లో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ మూవీ ట్రెండింగ్‌లో ఉంది. సినిమాలోని పాటలు, అందర్ని ఆకట్టుకునే డైలాగ్స్ మూవీకి బాగా ప్లస్ అయ్యాయి.

Tags:    

Similar News