Rajinikanth: ఆయనతో గడిపిన ప్రతి క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా.. రజినీకాంత్ ట్వీట్

ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా మరణంతో దేశవ్యాప్తంగా విషాద చాయలు అలుముకున్నాయి.

Update: 2024-10-10 12:57 GMT

దిశ, సినిమా: ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా మరణంతో దేశవ్యాప్తంగా విషాద చాయలు అలుముకున్నాయి. అయితే రతన్ (Ratan Tata)చనిపోవడంతో సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ‘X’ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘తన విజన్, అభిరుచి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలిచేలా చేశాయి.

వేలాది మంది పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిచ్చి, ఎన్నో తరాలుగా లక్షలాది ఉద్యోగాలు సృష్టించారు. అలాగే అందరి అభిమానం, గౌరవం పొందిన ఆయన లాంటి గొప్ప వ్యక్తితో గడిపిన ప్రతి క్షణాన్ని నేను ఎప్పటికీ గౌరవించడంతో పాటు గుర్తుంచుకుంటా. భారతదేశానికి నిజమైన కుమారుడు ఇక లేడు. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’’ అని రాసుకొచ్చారు.

Tags:    

Similar News