మెట్రో డీపీఆర్ పై కోర్టును ఆశ్రయిస్తాం : ఎమ్మెల్యే వివేకానంద

Update: 2024-10-06 06:19 GMT

దిశ, వెబ్ డెస్క్ : మెట్రో రైలు పొడిగింపులో రెండో డీపీఆర్ పై కోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కే.పి. వివేకానంద గౌడ్ స్పష్టం చేశారు. మేడ్చల్ వరకు మెట్రో రైలును పొడిగించాలని కోరుతూ మెట్రో సాధన సమితి జీడిమెట్ల లో నిర్వహించిన ధర్నా లో ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వివేకానంద మాట్లాడుతూ మేడ్చల్ వరకు మెట్రో పొడిగించకపోతే ఉద్యమం తప్పదని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రెండో డీపీఆర్ ను తెచ్చారని ఆరోపించారు. గతంలో ప్రతిపాదించిన మేరకు మెట్రో రైలు పొడిగించకపోతే ఈ ప్రాంతం నుంచి సీఎంను, మంత్రులను తిరగనివ్వమని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి అనుభవ రాహిత్యంతోనే అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. మెట్రో రైల్ డీపీఆర్ అంశంపై కోర్టును ఆశ్రయిస్తామని, ప్రజా క్షేత్రంలోనూ పోరాడుతామని ప్రకటించారు. 


Similar News