ఎన్ఐటీ లో జేఈఈ మెయిన్ అభ్యర్థుల కోసం ఓపెన్ హౌస్..
ఎన్ఐటీ వరంగల్ జేఈఈ మెయిన్ అర్హత సాదించిన అభ్యర్థుల కోసం ఓపెన్ హౌస్ను నిర్వహించింది.
దిశ, కేయూ క్యాంపస్ : ఎన్ఐటీ వరంగల్ జేఈఈ మెయిన్ అర్హత సాదించిన అభ్యర్థుల కోసం ఓపెన్ హౌస్ను నిర్వహించింది. అసోసియేట్ డీన్, అడ్మిషన్స్ ప్రొఫెసర్ ఎస్. రవి చంద్ర ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, అభ్యర్థులకు ఓరియంటేషన్ నిర్వహించారు. ఈ ఓరియంటేషన్లో ఎన్ఐటీ వరంగల్లో అందిస్తున్న పాఠ్యాంశాలు, సౌకర్యాలు, కార్యక్రమాల పై ఆయన మాట్లాడారు.
అభ్యర్థులు బీటెక్లోని 11 కోర్సులకు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్లో 3 కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రొఫెసర్ బిద్యధర్ సుబుధి తెలిపారు. ప్రొఫెసర్ ఎ.శరత్ బాబు, డీన్ అకడమిక్స్ బృందం విద్యార్థులకు సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీన్లు, హెడ్లు, అడ్మిషన్ల బృందం పాల్గొన్నారు.