Trending: మంత్రి సీతక్క సింప్లిసిటీ.. సాధారణ ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీ

ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ఏటూరు నాగారం నుంచి మంగపేట మండలం నరసింహసాగర్‌కు వెళ్లే బస్సు సర్వీసును మంత్రి సీతక్క మంగళవారం ప్రారంభించారు.

Update: 2024-06-18 13:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ఏటూరు నాగారం నుంచి మంగపేట మండలం నరసింహసాగర్‌కు వెళ్లే బస్సు సర్వీసును మంత్రి సీతక్క మంగళవారం ప్రారంభించారు. ఈ మేరకు ఆమె కలెక్టర్‌తో కలిసి ఆ బస్సులో టికెట్ తీసుకుని ఉచితంగా ప్రయాణించారు. ఆమె పర్యటన సందర్భంగా ఏటూరు నాగారంలో బస్ డిపో ఏర్పాటు, ములుగు బస్ స్టాండ్‌ను మోడల్ బస్ స్టాండ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించాలని ఆమె అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఆ రెండు పనులకు మంత్రి సీతక్క శ్రీకారం చుట్టనున్నారు.

Tags:    

Similar News