Trending: శభాష్ ‘తెలంగాణ పోలీస్’.. సోషల్ మీడియాలో జై కొడుతున్న నెటిజన్లు

రోడ్లపై ప్రమాదాలు జరిగితే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రోజులు ఇవి.

Update: 2024-08-01 04:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: రోడ్లపై ప్రమాదాలు జరిగితే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రోజులు ఇవి. ఈ క్రమంలోనే యాద్రాద్రి జిల్లా చౌటుప్పల్ పోలీసులు చేసిన ఓ పని చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు ‘శభాష్ పోలీస్’ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా, చౌటుప్పల్ మండలం లక్కారంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓవైపు నుంచి బీరు సీసాల లోడుతో, మరోవైపు ఉల్లిగడ్డ లోడ్‌తో వస్తున్న లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ డ్రైవర్ స్పాట్‌లో మృతి చెందాడు. అనంతరం ధ్వంసమైన బీరు సీసాల గాజు ముక్కలు ప్రమాదకరంగా రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో స్పాట్ చేరుకున్న చౌటుప్పల్ పోలీసులు కిలో మీటరు మేర ట్రాఫిక్‌ జామ్‌ను క్లియర్ చేశారు. వాహనాదారులకు ఇబ్బంది కాకండా రోడ్డు పక్కనే ఉన్న చెట్ల కొమ్మలను విరిచి రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయిన గాజు ముక్కలను ఓ పక్కకు ఊడ్చేశారు. దీంతో చౌటుప్పల్ పోలీసులకు డ్యూటీ పట్ల ఉన్న నిబద్ధతను చూసి వాహనదారులు, సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Tags:    

Similar News