తిరుమలలో భక్తురాలిపై ఒక్కసారిగా విరిగిపడ్డ చెట్టుకొమ్మ

తిరుమల కొండపై ఓ భక్తురాలిపై చెట్టుకొమ్మ విరిగిపడటం తీవ్ర కలకలం రేపింది.

Update: 2024-07-12 06:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల కొండపై ఓ భక్తురాలిపై చెట్టుకొమ్మ విరిగిపడటం తీవ్ర కలకలం రేపింది. తిరుమల కొండపై ఉన్న జాపాలి హనుమాన్ ఆలయానికి ఆంజనేయ స్వామి దర్శనం కోసం నడుచుకుంటూ ఓ యువతి వెళ్తోంది. అయితే ఒక్క సారిగా సదరు యువతిపై భారీ చెట్టుకొమ్మ విరిగిపడింది. దీంతో యువతి తల, వెన్నుముకుకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతికి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనను మరో భక్తుడు తన ఫోన్‌లో చిత్రీకరించగా సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Similar News