తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన ‘ప్రజాపాలన’

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘ప్రజాపాలన’ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది.

Update: 2023-12-28 05:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘ప్రజాపాలన’ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని గ్రామాల్లో ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, మండల, గ్రామ స్థాయిలో స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులతో కలిసి నోడల్ అధికారుల ఆదేశాలతో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు అన్ని గ్రామల్లో ఈ కార్యక్రమం జరుగనుంది. ఒక వేళ గ్రామంలో కార్యక్రమం జరిగిన సమయంలో మీరు అందుబాటులో లేకపోతే గడువు ముగిసిన తర్వాత కూడా దగ్గర్లోని మండల పరిషత్, మున్సిపల్ కేంద్రాల్లో అధికారులకు అప్లికేషన్ అందజేయవచ్చని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Tags:    

Similar News