పీవీ అందించిన స్ఫూర్తి మరవలేనిది.. : KCR

భారత మాజీ ప్రధాని, భారత రత్న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా వారు దేశానికి అందించిన సేవలను మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు.

Update: 2024-06-28 05:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ప్రధాని, భారత రత్న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా వారు దేశానికి అందించిన సేవలను మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. నాటి ప్రపంచ ఆర్థిక విధానాలకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక స్థితిని చక్కదిద్దిన దార్శనికుడు పీవీ అన్నారు. భరత జాతి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని కొనియాడారు. తెలంగాణ బిడ్డగా మనందరం గర్వపడాల్సిన పీవీ అందించిన స్ఫూర్తి మరువలేనిదని కేసీఆర్ తెలిపారు.


Similar News