హైకోర్టు తీర్పుపై నలుగురు ఎమ్మెల్యేల్లో తీవ్ర ఉత్కంఠ

2023 సంవత్సరం చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.

Update: 2024-09-08 15:26 GMT

దిశ, వెబ్ డెస్క్: 2023 సంవత్సరం చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. కాగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వివిధ కారణాలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. సోమవారం తీర్పును వెల్లడించనుంది. దీంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.


Similar News