Surrender: వరుస ఎన్కౌంటర్ల వేళ కీలక పరిణామం.. లొంగిపోయిన 86 మంది మావోయిస్టులు
ఐదు రాష్ట్రాల్లోని దండకారణ్యాల్లో భద్రతా బలగాలు వరుస ఎన్కౌంటర్ల (Encounters) మావోయిస్టులపై విరచుకుపడుతోన్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
దిశ, వెబ్డెస్క్: ఐదు రాష్ట్రాల్లోని దండకారణ్యాల్లో భద్రతా బలగాలు వరుస ఎన్కౌంటర్ల (Encounters) మావోయిస్టులపై విరచుకుపడుతోన్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు ఇవాళ తెలంగాణ (Telangana)లోని భద్రాద్రి కొత్తగూడం (Bhadradri Kothagudem) జిల్లాలో మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 86 మంది మావోయిస్టులు పోలీస్ బెటాలియన్ (Police Battalion) కార్యాలయంలో ఐజీ (IG) ఎదుట సరెండర్ అయ్యారు. వారంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రంల సుక్మా, బీజాపూర్ దళ సభ్యులని పోలీసులు వెల్లడించారు. లోంగిపోయిన వారిలో 20 మంది మహిళా మావోయిస్టులు (Women Maoists) కూడా ఉన్నారు. అయితే, ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లు.. పక్కా బూటకపు ఎన్కౌంటర్లు అంటూ ఈ నెల 3న భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఓ లేఖను విడుదల చేసింది. అందులో కార్పొరేట్ దోపిడీని సులభతరం చేసేందుకు కేంద్రం దేశంలో మావోయిస్టుల నరమేధానికి తెరలేపారని ఆక్షేపించారు. ఆదివాసీలు, విప్లవకారులు ఈ నర సంహారాన్ని వెంటనే ఆపాలని తాము చర్చలకు సిద్ధం అంటూ లేఖలో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు పోలీసుల ఎదుట లోంగిపోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.