Supreme Court: సంయమనం పాటించాల్సిన అవసరం లేదా.. సీఎం రేవంత్పై సుప్రీంకోర్టు ఫైర్
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కాసేపటి క్రితం విచారణ ప్రారంభమైంది.
దిశ, వెబ్డెస్క్: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కాసేపటి క్రితం విచారణ ప్రారంభమైంది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice BR Gavai), ఆగస్టీన్ జార్జ్ మసీహ్ల (Justice Augustine George Masihla) ద్విసభ్య ధర్మాసనం వాదనలు వింటోంది. అసెంబ్లీ సెక్రటరీ తరఫున అభిషేక్ మను సింఘ్వి (Abhishek Manu Singhvi) తన వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు అంటూ.. ఇటీవల అసెంబ్లీ (Assembly) వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తరఫు అడ్వొకేట్ ఆర్యమా సుందరం (Aryama Sundaram) కోర్టు దృష్టి తీసుకెళ్లారు. దీంతో జస్టీస్ బీఆర్ గవాయి (Justice BR Gavai) సీఎం చేసిన వ్యా్ఖ్యలపై సీరియస్ అయ్యారు. ఓ రాష్ట్రానికి సీఎంగా ఉండి కోర్టు పరిధిలో ఉన్న అంశంపై సంయమనం పాటించాల్సి అక్కర్లేదా అని కామెంట్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై తాము కోర్టు ధిక్కార చర్యలు తీసుకోకుండా తప్పు చేశామా..? అంటూ గంభీర వ్యాఖ్యలు చేశారు. తమకు ప్రజాస్వామ్య వ్యవస్థపై పూర్తి గౌరవం ఉందన్నారు. మిగతా రెండు వ్యవస్థల నుంచి కూడా అలాంటి గౌరవం ఉండాలని తాము కోరుకుంటున్నామని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు.
కాగా, కేసులో సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్ తీర్పు సరైందేనని అన్నారు. స్పీకర్కు గడువు విధించిన హైకోర్టు సింగిల్ బెంచ్ (High Court Single Bench) తీర్పు సరికాదని వాదించారు. స్పీకర్ (Speaker) నిర్ణయంలో హైకోర్టు జోక్యంపై ఆయన అభ్యతరం వ్యక్తం చేయగా.. జస్టిస్ బీఆర్ గవాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై ఇక న్యాయస్థానాలు చేతులు కట్టుకుని కూర్చోవాలా అని కామెంట్ చేశారు. ఇదివరకు కోర్టు ధిక్కరణ కేసులో అసెంబ్లీ స్పీకర్ను కూడా కోర్టులో నిలబెట్టామనే విషయాన్ని మర్చిపొవొద్దని అన్నారు. పార్టీ ఫిరాయింపులను అడ్డుకునేందుకు రాజ్యాంగంలో షెడ్యూల్-10, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లేనని జస్టిస్ బీఆర్ గవాయి అన్నారు.
Read More: Supreme Court: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వ్