Hyd: గచ్చిబౌలిలో కాల్పులు జరిపింది అతడే.. 100కి పైగా కేసులు
హైదరాబాద్ గచ్చిబౌలిలో పోలీసులపై దొంగ కాల్పులు జరిపిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి..

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ గచ్చిబౌలి(Hyderabad Gachibowli)లో పోలీసులపై దొంగ కాల్పులు జరిపిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాల్పులు జరిపింది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్(Most wanted criminal Battula Prabhakar) అని తేలింది. ప్రభాకర్ది చిత్తూరు జిల్లా వడ్డిపల్లి గ్రామం(Vaddipalli village of Chittoor district). నిందితుడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 100కి పైగా చోరీ కేసులున్నాయి. తాజాగా గచ్చిబౌలి ప్రిజం పబ్(Vaddipalli village of Chittoor district)లో బత్తుల ప్రభాకర్ కాల్పులు జరిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పబ్లో సైబరాబాద్ సీసీఎస్ పోలీసుల తనిఖీలు చేశారు. దీంతో పోలీసులను చూసిన వెంటనే ప్రభాకర్ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ వెంకట్ రెడ్డికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. 2022లోనే బత్తుల ప్రభాకర్ విశాఖ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. తాజాగా కాల్పుల ఘటనతో ప్రభాకర్ మళ్లీ వెలుగులోకి వచ్చారు.