తెలంగాణకు రూ.839 కోట్ల పెట్టుబడి.. CM రేవంత్‌తో కర్రా హోల్డింగ్స్ ఒప్పందం

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబుల బృందం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-08-06 03:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబుల బృందం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్కారుతో కర్రా హోల్డింగ్స్ రూ.839 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రూ.42 కోట్ల పెట్టుబడులకు కర్రా హోల్డింగ్స్ చేసుకోగా.. రాబోయే ఐదేళ్లలో మరో రూ.839 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ మేరకు సీఎం రేవంత్‌తో వాల్స్ కర్రా హోల్డింగ్స్ బృందం చర్చలు జరిపింది. పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలపై ఇరువురు సంతకాలు చేశారు. 

Tags:    

Similar News