తెలుగు వెలుగు రామోజీరావు మృతి తీరని లోటు.. : చంద్రబాబు

ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు (88) మృతి పట్ల టీడీపీ చీఫ్, ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Update: 2024-06-08 02:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు (88) మృతి పట్ల టీడీపీ చీఫ్, ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు తెలుగు వెలుగు అని కీర్తించారు. రామోజీరావు మృతి తీరని లోటు అన్నారు. రామోజీరావు మృతి తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. అక్షర యోధుడు రామోజీరావు సేవలు ఎనలేనివి అని కొనియాడారు. అయితే నిన్న ఎన్డీఏ భేటీలో పాల్గొన్న చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీలో ఉండగా..నేడు ఆయన హుటాహుటిన హైదరాబాద్ రానున్నారు. రామోజీరావు మృతి పట్ల ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సైతం ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. 


Similar News