Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిరసన సెగ

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది.

Update: 2024-09-08 06:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. కిషన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారును స్థానిక మహిళలు అడ్డుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోగా తాము కిషన్ రెడ్డితో మాట్లాడుతామని కోరారు. దీంతో కిషన్ రెడ్డి కారు దిగి బాధితులతో మాట్లాడారు. వరదల్లో తాము సర్వం కోల్పోయిన కేంద్రం నుంచి తమకు ఎలాంటి సహాయ సహాకారాలు అందలేదని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. తమను ఆదుకోవాలని కోరారు. వారితో మాట్లాడిన కిషన్ రెడ్డి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా ఆదివారం కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఖమ్మం జిల్లాలో వరద ముంపు బాధితులను పరామర్శించారు. 


Similar News