లారీని ఢీకొని ప్రైవేట్ బస్సు బోల్తా.. ఒకరు మృతి
కామారెడ్డి జిల్లాలో లారీని ఢీకొని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.
దిశ, వెబ్డెస్క్: కామారెడ్డి జిల్లాలో లారీని ఢీకొని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కామారెడ్డి శివారులోని 44వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 28 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి హుటాహుటిన తరలించారు. లారీ సెడెన్ బ్రేక్ వేయడంతో బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. బస్సు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.