కాళేశ్వరం ఎంక్వైరీ.. విచారణ తర్వాత వికాస్ రాజ్, రజత్ కుమార్‌కు కమిషన్ కీలక ఆదేశాలు

Update: 2024-07-15 07:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, దాని అనుబంధ బ్యారేజీలపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నేడు ముగ్గురు ఐఏఎస్, రిటైర్ట్ ఐఏఎస్ అధికారులను విచారిచింది. కాగా, ఐఏఎస్ వికాస్ రాజ్, రిటైర్ట్ ఐఏఎస్ రజత్ కుమార్‌లు విచారణ అనంతరం కాసేపటి క్రితం వెళ్లిపోయారు. అయితే ఈ ఇద్దరు ఆఫీసర్లు వారం రోజుల్లోగా అఫిడవిట్ ఫైల్ చేయాలని కమిషన్ ఆదేశించింది. వీరితో పాటు ఫైనాన్స్ వింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు సైతం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరయ్యారు. వీరు విచారణలో ఏం చెప్పారనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కాగా, మరో వైపు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ సైతం నేడు విచారణకు హాజరు కావాల్సి ఉంది.

Tags:    

Similar News