పటాన్​చెరు కాంగ్రెస్​లో పంచాయతీకి ఫుల్​స్టాప్

పటాన్​చెరు నియోజకవర్గ కాంగ్రెస్​పంచాయతీకి ఫుల్​స్టాప్​పెట్టేందుకు పీసీసీ సిద్ధమైంది.

Update: 2025-01-30 17:28 GMT
పటాన్​చెరు కాంగ్రెస్​లో పంచాయతీకి ఫుల్​స్టాప్
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో : పటాన్​చెరు నియోజకవర్గ కాంగ్రెస్​పంచాయతీకి ఫుల్​స్టాప్​పెట్టేందుకు పీసీసీ సిద్ధమైంది. ఇటీవల పటాన్​చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి కాటా శ్రీనివాస్​గౌడ్​మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈక్రమంలోనే రంగంలోకి దిగిన కాంగ్రెస్​అధిష్టానం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈమేరకు ఆ కమిటీ పటాన్​చెరులో పర్యటించి, పూర్తి స్థాయి వివరాలను సేకరించింది. ఆపై ఇరువురిని గాంధీ భవన్​కు రావాలని కమిటీ ఆదేశించింది. దీంతో రెండు రోజుల కిందట నియోజకవర్గ ఇన్​చార్జి కాటా శ్రీనివాస్​గౌడ్​గాంధీ భవన్​కు వచ్చారు. అతని నుంచి కమిటీ అభిప్రాయాలను సేకరించింది. కాగా, మహిపాల్​రెడ్డి తనకు రెండు రోజుల సమయం కావాలని కోరినట్లు తెలిసింది. ఇవాళ హైదరాబాద్​కు వచ్చిన మహిపాల్​రెడ్డి టీపీసీసీ వైస్​ప్రెసిడెంట్​ వినోద్​రెడ్డి ఇంట్లో ప్రభుత్వ విప్​ఆది శ్రీనివాస్​రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పటాన్​చెరులో నెలకొన్న పరిస్థితులను మహిపాల్​రెడ్డి కమిటీకి వివరించినట్లు తెలిసింది. ఆయన నుంచి కమిటీ మరిన్ని అభిప్రాయాలు సేకరించినట్లు సమాచారం. అయితే, పటాన్​చెరు కాంగ్రెస్​లోని ఇరువర్గీయుల మధ్య నెలకొన్న సమస్యను సమరస్యంగా పరిష్కరించి, వివాదానికి ఫుల్​స్టాప్​పెట్టాలని కమిటీ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

Tags:    

Similar News