ఓఆర్ఆర్‌పై పల్టీలు కొట్టిన కారు.. ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

వేగంగా వెళుతున్న కారు ఉన్నట్లుండి అదుపు తప్పి డివైడర్‌‌ను ఢీకొట్టడంతో భారీ ప్రమాదానికి గురైంది.

Update: 2024-09-21 04:37 GMT

దిశ, అబ్దుల్లాపూర్మెట్: రంగారెడ్డి జిల్లాలోని పెద్ద అంబర్‌పేట వద్ద భారీ భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓఆర్ఆర్‌పై వేగంగా వెళుతున్న కారు ఉన్నట్లుండి అదుపు తప్పి డివైడర్‌‌ను ఢీకొట్టడంతో భారీ ప్రమాదానికి గురైంది. శుక్రవారం రాత్రి అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిథిలో జరిగిన ఈ ఘటనలో వేగంగా వెళుతున్న ఎర్టిగా కారు పల్టీలు కొడుతూ కింద పడడంతో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ మృతి అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి పంపించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓఆర్ఆర్‌‌పై వెళుతండగా తారామతిపేట వద్ద ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గరకు చేరుకునేసరికి అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టడమే కాకుండా ఆదే వేగంలో పల్టీలు కొడుతూ ఔటర్‌పై నుంచి కింద పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న ఈసీఐఎల్‌కు చెందిన సౌపతి (23) శ్రీవల్లి అక్కడిక్కక్కడే మృతి చెందగా మేడిశెట్టి శివ, సానిక అనిల్‌ అనే మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించడం జరిగింది. మృతి చెందిన సౌపతి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Similar News