పెళ్లి అయిన నాలుగు నెలలకే నవ వధువు మృతి

కన్నవారిని ఎదిరించి ప్రేమించిన పెళ్లి చేసుకుంది. ఇక త‌న భ‌ర్తతో జీవితం సజావుగా గ‌డ‌పాల‌నుకుంది .కానీ ఆ న‌వ వ‌ధువును అనారోగ్య సమస్యలు వెంటడాయి. ఈ క్రమంలో నవ వధువు మృతి చెందింది.

Update: 2024-08-28 05:32 GMT

దిశ, తాడ్వాయి: కన్నవారిని ఎదిరించి ప్రేమించిన పెళ్లి చేసుకుంది. ఇక త‌న భ‌ర్తతో జీవితం సజావుగా గ‌డ‌పాల‌నుకుంది .కానీ ఆ న‌వ వ‌ధువును అనారోగ్య సమస్యలు వెంటడాయి. ఈ క్రమంలో నవ వధువు మృతి చెందింది. ఈ విషాద ఘ‌ట‌న మండలంలోని బ్రాహ్మజీవాడి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రహ్మాజీ వాడి గ్రామానికి చెందిన అర్చన (24) నాలుగు నెలల క్రితం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన రవితేజ ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న కొద్ది రోజులకే అత్తారింట్లో వేధింపులు తాళలేక మరోవైపు అరోగ్య సమస్యలు వెంటాడుతుండడంతో అర్చన తల్లి గారి ఇంటి దగ్గర ఉంటుందన్నారు. ఆరోగ్య సమస్యలు అర్చనను వెంటాడుతుండడంతో తల్లిదండ్రులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు.

కాగా ఆరోగ్యం క్షీణించగా.. ప్రేమించిన భర్త చూసేందుకు ఎంతగానో ఆరాటపడింది. కాగా తన భర్త ఎంతకు రాకపోవడంతో మనోవేదనకు గురైన అర్చన తుది శ్వాస వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను స్మరిస్తూ.. తల్లి గారి ఇంటి దగ్గర మరణించింది. దీంతో అర్చన మరణించిన విషయాన్ని అర్చన అత్తమ్మమాలకు తెలియజేసిన ఎవరు రాలేదన్నారు. మరుసటి రోజు భర్త ఒక్కడే రావడం తో ఆగ్రహానికి గురైన అర్చన తల్లిదండ్రులు రవితేజ వెంట వచ్చిన బంధువుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పరిస్థితి చక్కదిద్దారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులు బంధువుల శోకసముద్రంలో మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.


Similar News