ప్రేమలో మోసపోయిన యువకుడు ఆత్మహత్య

ఓ అమ్మాయిని ప్రేమించి మోసపోయానని జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకరమైన ఈ ఘటన నిజామాబాద్ నగరంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.

Update: 2024-08-27 07:11 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఓ అమ్మాయిని ప్రేమించి మోసపోయానని జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకరమైన ఈ ఘటన నిజామాబాద్ నగరంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఘటనపై మృతుడి కుటుంబీకులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని వన్ టౌన్ పరిధిలో కుమార్ గల్లీకి చెందిన సునీల్ (22) అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, తన ప్రేమ విఫలమైందనే ఆవేదనతో ఆత్మహత్య చేసున్నాడు. తను నిర్వహిస్తున్న జనరల్ స్టోర్‌లోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఒకటో టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. చిన్న వయసులోనే ప్రేమ విఫలమై అర్ధాంతరంగా జీవితాన్ని చాలించిన సునీల్ మృత దేహాన్ని చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు. అండగా ఉంటాడనుకున్న కొడుకు అర్ధాంతరంగా దూరమయ్యాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.


Similar News