పెర్కిట్ నడిబొడ్డున యువకుడిపై కత్తిపోట్లు

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ -కోటార్ మూర్ చౌరస్తాలో మంగళవారం సాయంత్రం నడిబొడ్డున కత్తిపోట్ల సంఘటన కలకలం రేపింది.

Update: 2024-08-20 14:03 GMT

దిశ,ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ -కోటార్ మూర్ చౌరస్తాలో మంగళవారం సాయంత్రం నడిబొడ్డున కత్తిపోట్ల సంఘటన కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్-కోటార్ మూర్ ఏరియా కు చెందిన బండి మహేష్, ఆకుల ప్రశాంతుల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఇరువురు యువకులు ఆ చౌరస్తాలోని ఓ మద్యం షాపులోని పర్మిట్ రూమ్ లో మద్యం సేవించారు. మద్యం సేవించిన ఇరువురు యువకుల్లో ఆకుల ప్రశాంత్ ఆయన వద్ద ఉన్న కత్తితో బండి మహేష్ పై దాడి చేయగా అతడు తీవ్ర గాయాల పాలయ్యాడు. కత్తితో మహేష్ ను గాయపరిచిన ప్రశాంత్ అక్కడి నుంచి పరార్ కాగా.. కత్తిపోట్ల సంఘటన సమాచారాన్ని అందుకున్న ఆర్మూర్ పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాద స్థలాన్ని పరిసరాలను పరిశీలించారు. కత్తిపోట్లతో గాయాలకు గురైన బండి మహేష్ ను చికిత్స నిమిత్తం ఆర్మూర్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు.


Similar News