సీఎం రేవంత్ రెడ్డితో మందకృష్ణ మాదిగ భేటీ

ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని

Update: 2024-08-22 13:50 GMT

దిశ, మద్నూర్: ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్రాలకు అమలు చేసేందుకు అధికారం ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పై తీర్పును తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్ రెడ్డి తో విజ్ఞప్తి చేశారు. మందకృష్ణ తో పాటు సీఎంను కలిసిన వారిలో మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, తోట లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి మెతుకుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ పసునూరి దయాకర్, ప్రొఫెసర్ ఖాసిం, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News