crime : చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని బంజారా తండా గ్రామంలో చోటు చేసుకుంది.

Update: 2024-08-20 12:51 GMT

దిశ : నాగిరెడ్డిపేట్ : చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని బంజారా తండా గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై మల్లారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… బంజారా తండా గ్రామానికి చెందిన దేగావత్ పీర్ సింగ్ (39) అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడని, అప్పుడప్పుడు చేపల వేటకు వెళ్ళేవారు. సోమవారం రాత్రి చేపల వేటకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి మంగళవారం ఉదయం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో పీర్ సింగ్ కుటుంబ సభ్యులు తాండూర్ గ్రామ శివారులోని నాగనయ్య చెరువు పరిసర ప్రాంతాల్లో వెతికారు.

చెరువు కట్టపై పీర్ సింగ్ బైక్, చేపలు పట్టే ఊత అక్కడే ఉండటంతో, పీర్ సింగ్ చెరువులో మునిగి ఉంటాడని భావించి గోపాల్ పేట్ గ్రామానికి చెందిన గజ ఈతగాడు బెస్త రాములు తో చెరువులో వెతికించడం జరిగిందన్నారు. పీర్ సింగ్ చేపలు పడుతుండగా చేపల వల కాళ్లు, చేతులకు చుట్టుకుని ప్రమాదవశాత్తు పది అడుగుల లోతు నీటిలో మునిగి చనిపోయినట్లు తెలిపారు. మృతునికి భార్య నానుకు, ఇద్దరు కుమారులు రాకేష్, అఖిలేష్ లు ఉన్నట్లు తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Similar News