నీలకంఠేశ్వర ఆలయం కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న కవిత..

Update: 2023-11-20 16:53 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో జరిగిన కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆమె కలియతిగారు. ఈ క్రమంలో భక్తులు ఆమెతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియజేశారు. కార్తీక మహాదీపోత్సంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్తీక మాసానికి, నీలకంఠేశ్వర స్వామివారికి తమకు ఎంతో అనుబంధం ఉందని, చాలా ఏళ్ళ నుంచి కార్తీక పౌర్ణమినాడు ఈ ఆలయానికి వస్తుంటామని చెప్పారు. కార్తీక మాసం సందర్భంగా నిజామాబాద్ ప్రజలకు శుభం జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.


Similar News