ఈ సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయండి
గ్రామీణ, పట్టణ ప్రాంతంలో తాగు నీటి సమస్య ఉంటే వెంటనే కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన తాగునీటి మానిటరింగ్ సెల్ కు ఫోన్ చేసి సమస్య వివరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.

దిశ, కామారెడ్డి : గ్రామీణ, పట్టణ ప్రాంతంలో తాగు నీటి సమస్య ఉంటే వెంటనే కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన తాగునీటి మానిటరింగ్ సెల్ కు ఫోన్ చేసి సమస్య వివరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తినపుడు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మానిటరింగ్ సెల్ నెంబర్ 9908712421 కు కాల్ చేసి తెలియజేయవచ్చని తెలిపారు. ఈ మానిటరింగ్ సెల్ ప్రతీ రోజు ఉదయం గం.10-30 నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందని,ఈ సెల్ ద్వారా త్రాగు నీటి సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. సమస్యకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకొని సంబంధిత పంచాయతీ, మిషన్ భగీరథ అధికారులకు, సిబ్బందికి తెలియపరచి సమస్యను పరిస్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సెల్ ను కలెక్టర్ సోమవారం సాయంత్రం పరిశీలించి తగు ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి మురళీ, తదితరులు పాల్గొన్నారు.