గంజాయి విక్రేత అరెస్టు

నిజామాబాద్ నగరంలోని ఖిల్లా ప్రాంతంలో శుక్రవారం ఎండు గంజాయి విక్రేత ను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.

Update: 2024-08-09 13:39 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని ఖిల్లా ప్రాంతంలో శుక్రవారం ఎండు గంజాయి విక్రేత ను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 455 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన తనిఖీలో షేక్ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి టీవీఎస్ ఎక్స్ఎల్ మోపెడ్ పై

     వెళుతుండగా ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితున్ని అడ్డగించి తనిఖీ చేయగా అతని వద్ద 455 గ్రాముల ఎండు గంజాయి దొరికినట్లు అధికారులు తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ విలియం, ఎస్ ఐ మల్లేష్ ఇతర సిబ్బంది ఉన్నారు. 

Tags:    

Similar News