5 మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గం.. ఉత్తర్వులు జారీ

రాష్ట్రంలో మరో 5 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2024-08-31 16:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మరో 5 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 44 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గద్వాల, అలంపూర్, జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి, ధర్మపురి, సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్ తో పాటు నూతన పాలకవర్గాలను నియమించారు. గద్వాల మార్కెట్ కమిటీ చైర్మన్ గా కుర్వ హనుమంతు, వైస్ చైర్మన్ గా గంగిరెడ్డి శ్రీకాంత్, అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉప్పరి దొడ్డెన్న, వైస్ చైర్మన్ గా రుక్మందర్ రెడ్డి, గొల్లపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా బీమ సంతోష్, వైస్ చైర్మన్ గా పురపాటి రాజిరెడ్డి, ధర్మపురి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా చిలుముల లావణ్య, వైస్ చైర్మన్ గా సంగ నర్సింహులు, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా మహమ్మద్ సర్దార్ ఖాన్ నియామకం అయ్యారు.


Similar News